త్వరలోనే సెట్స్ పైకి....

Friday,November 25,2016 - 06:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఎదురుచూసే మల్టీ స్టారర్ సినిమాలు టాలీవుడ్ లో ఊపందుకుంటున్నాయనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ హీరోల నుండి చోటా హీరోల వరకూ మల్టీ స్టారర్ సినిమాలో  నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ లో  మరో మల్టీ స్టారర్ అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. ఆ మల్టీస్టారర్ కి ఓ ప్రత్యేక కూడా ఉండడం తో అందరి చూపు ఇప్పుడు ఆ సినిమా పైనే.

విషయం లోకెళితే తాజాగా దర్శకుడు రవి కుమార్ చౌదరి ఓ మల్టీస్టారర్ ను సెట్స్ పై పెట్టేందుకు చూస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో పాటు మెగా హీరో సాయిధరమ్ ను కూడా ఎంచుకున్నాడు. ఇటీవలే వీరిద్దరి కి  కథ ను కూడా వినిపించాడట. అయితే వీరిద్దరికీ కథ బాగా నచ్చిందని త్వరలోనే ఈ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తుంది . ఈ సినిమాను  కె.ఎస్.రామారావు , దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాతల్లో ఎవరో ఒకరు నిర్మించడానికి రెడీ అవుతున్నారని  ఈ సినిమాకి ‘రామ కృష్ణ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని  సమాచారం.  మరి ఈ సినిమా కనుక సెట్స్ పైకి వెళ్తే ఎన్టీఆర్-చిరంజీవి కాంబినేషన్ తరువాత మరో మల్టీ స్టారర్ చెయ్యని నందమూరి-మెగా కాంపౌండ్ లో వీరిద్దరూ సరికొత్త ట్రెండ్ సృష్టించినట్లే.