Thursday,September 01,2016 - 02:00 by Z_CLU
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్, ప్రముఖ నిర్మాత హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్కుమార్ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వేల్యూస్తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జాగ్వార్’ కోసం ఇటీవలే బల్గేరియాలో కోట్ల రూపాయల వ్యయంతో హై రేంజ్లో కొన్ని యాక్షన్ సీన్స్ని చిత్రీకరించారు. ఇటీవలే ఈ చిత్రం లోని ఐటెం సాంగ్ కోసం తమన్నా ను సంప్రదించారు యూనిట్. సంప్రదించిన వెంటనే ఈ పాటకు ఓకే చెప్పేసిందట తమన్నా. ఈ సినిమా లో భారీ ఫైట్ తో పాటు తమన్నా స్పెషల్ సాంగ్ కూడా సినిమాకి హైలైట్గా నిలవనుందని అంటున్నాయి చిత్ర వర్గాలు .