మరో ఐటెంసాంగ్ లో అనసూయ

Wednesday,December 05,2018 - 03:35 by Z_CLU

అన‌సూయ మ‌రోసారి ఐటెంసాంగ్ చేయ‌నుంది. సాయి ధ‌ర‌మ్ తేజ న‌టించిన ఓ సినిమాలో ఐటెంసాంగ్ చేసిన ఈ బ్యూటీ.. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ హీరోలుగా దిల్‌రాజు నిర్మిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ “F2” సినిమాలో మరోసారి ఐటెంభామగా కనిపించబోతోంది.

 

రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మత్త పాత్ర‌తో న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ సినిమా తర్వాత ఇక ఐటెంసాంగ్స్ చేయనని ప్రకటించింది. కానీ రీసెంట్ గా మనసు మార్చుకొని ఎఫ్-2లో ఐటెంసాంగ్ కు ఓకే చెప్పింది.

 

అనసూయకు గ్లామర్ రోల్స్ కంటే క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే దక్కుతున్నాయి. దీనికి కారణం రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రే. ప్రస్తుతం ఈమె యాత్ర సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు మరో 2 సినిమాల్లో కూడా మంచి రోల్స్ చేస్తోంది.