అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది. వచ్చే వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. దీనికోసం హైదరాబాద్ లోనే సెట్ రెడీ చేస్తున్నారు. ఫారెస్ట్ సెట్ తో పాటు.. లారీల అడ్డా సెట్ ను రూపొందిస్తున్నారు. ఈ సెట్ లోనే పుష్ప కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.
లాక్ డౌన్ పడ్డానికి ముందు, చివరి నిమిషం వరకు పుష్ప షూటింగ్ జరిగింది. అప్పటికే దాదాపు అన్ని సినిమాలు నిలిచిపోయినప్పటికీ, పుష్ప యూనిట్ మాత్రం ధైర్యం చేసి ముందుకెళ్లింది. సరిగ్గా అదే టైమ్ లో దురదృష్టవశాత్తూ బన్నీ కరోనా బారిన పడ్డంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.
పుష్పరాజ్ గా అల్లు అర్జున్
అలా ఆగిపోయిన సినిమా ఇప్పటివరకు మళ్లీ సెట్స్ పైకి రాలేదు. మళ్లీ ఇన్ని రోజులకు పుష్ప కొత్త షెడ్యూల్ మొదలుకాబోతోంది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తున్న హీరోయిన్ రష్మిక.. నేరుగా ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చి ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది.
మలయాళ నటుడు ఫహాజ్ ఫాజిల్, పుష్ప సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్-1 ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది. అది థియేటర్లలోకి వచ్చిన తర్వాత పార్ట్-2పై క్లారిటీ వస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప సినిమాలో, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఐటెంసాంగ్ చేయబోతోంది.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics