అల వైకుంఠపురంలో అల్లు అర్జున్

Thursday,August 15,2019 - 03:54 by Z_CLU

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. ఈ మూవీకి అల వైకుంఠపురంలో.. అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇదే టైటిల్ 2 రోజులుగా సోషల్ మీడియాలో కూడా నలుగుతోంది. టైటిల్ టీజర్ లో భాగంగా బన్నీ చెప్పిన ఓ చిన్న డైలాగ్ ను కూడా రిలీజ్ చేశారు.

 

“ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్” అని మురళీ శర్మ అడుగుతాడు. “ఇవ్వలేదు, వచ్చింది” అంటాడు బన్నీ. సినిమాలో ఈ డైలాగ్ ఉంటుందో ఉండదో తెలీదు కానీ, బన్నీ ప్రస్తుత కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని కావాలనే ఈ డైలాగ్ ను రిలీజ్ చేశారనే విషయం అర్థమౌతూనే ఉంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నివేత పెతురాజ్, టబు, నవదీప్, సుశాంత్, సత్యరాజ్, సునీల్, రాజేంద్రప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.