టార్గెట్ రీచ్ కాలేకపోయిన బన్నీ

Wednesday,June 24,2020 - 01:52 by Z_CLU

‘గంగోత్రి’ తో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ 2018 వరకు ఎలాంటి గ్యాప్ లేకుండా ఏడాదికో సినిమా చేశాడు. కానీ గతేడాది బన్నీ కెరీర్ కి అనుకోకుండా బ్రేక్ పడింది. అవును 2019 లో ఒక్క సినిమా కూడా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. అయితే లాస్ట్ ఇయర్ తన సినిమాను మిస్సయిన ఫ్యాన్స్ కి ఈ ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ ఎంటర్టైన్ మెంట్ అందించాలని భావించాడు స్టైలిష్ స్టార్.

ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠ పురములో’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అభిమానులలో పండగ వాతావరణం తీసుకొచ్చిన బన్నీ ఇదే ఏడాది సుకుమార్ తో చేస్తున్న ‘పుష్ప’ ను కూడా థియేటర్స్ లోకి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ కరోనా ఎఫెక్ట్ తో రెండు సినిమాల టార్గెట్ మిస్సయ్యాడు.

లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడటం, ఇప్పట్లో షూటింగ్ మొదలు పెట్టే అవకాశం లేకపోవడంతో ‘పుష్ప’ సినిమాతో వచ్చే ఏడాది సందడి చేయాలనుకుంటున్నాడు .

సుక్కు -బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న ‘పుష్ప’ పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, ‘అల వైకుంఠపురములో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో హైప్ బాగా పెరిగింది. మరి తన 20వ సినిమాతో బన్నీ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.