అంతా రెడీ: మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఈవెంట్

Saturday,January 19,2019 - 09:25 by Z_CLU

మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా స్టార్ట్ కాబోతోంది. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్స్ తో పాటు వెబ్ సైట్, ఫేస్ బుక్, యూట్యూబ్ సోషల్ మీడియమ్స్ లో ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను లైవ్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు

ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. అఖిల్ సినిమా ఫంక్షన్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. వీళ్లిద్దర్నీ ఒకే వేదికపై చూసేందుకు అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన మిస్టర్ మజ్ను సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. జనవరి 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకానుంది మిస్టర్ మజ్ను.