`జాను` చిత్రంతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు
Wednesday,February 05,2020 - 12:47 by Z_CLU
శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన హార్ట్ టచింగ్ లవ్స్టోరీ ‘జాను‘ ఫిబ్రవరి 7న విడుదలవుతుంది. ఈసందర్భంగా మంగళవారం వైజాగ్లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ – ‘‘ముందుగా రెబల్స్టార్ ప్రభాస్కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు జాను అనే టైటిల్ మినహా మరో టైటిల్ పెట్టలేం. అప్పటికే ప్రభాస్ సినిమాకు జాన్ అనే టైటిల్ ఉన్నా కూడా.. నేను అడగ్గానే జాను అనే టైటిల్ను ఇచ్చిన ప్రభాస్, వంశీ, ప్రమోద్కి థాంక్స్ . తమిళంలో ఈ సినిమాను చూసినవాళ్లు.. అందమైన కావ్యం తరహా చిత్రమని అన్నారు. మా బ్యానర్లో చాలా సినిమాలను నిర్మించాం. 96 తమిళ సినిమాను నేను చూసినప్పుడు నాకు అద్భుతమైన సినిమా అనిపించింది. అప్పుడే రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆరోజు నుండి నేటి వరకు ఈసినిమాతో జర్నీ చేస్తూనే ఉన్నాను. ఈ సినిమా చూసిన కొంత మంది ఇలాంటి క్లాసిక్ను ఎందుకు చేస్తున్నారని అన్నారు. కానీ 96 సినిమాను చూసిన వారు కూడా ఈ సినిమాను కూడా చూస్తారు. శర్వా, సామ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ టీమ్ అదే కావడం వల్ల అద్భుతమైన కావ్యాన్ని మళ్లీ క్రియేట్ చేశారు. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ఉంటాయి. ఈ ఫిబ్రవరి 7న తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతికి లోనవుతారు. అదే ఫీలింగ్స్తో ఇంటికి వెళతారు. యూత్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు’’ అన్నారు.