సైలెంట్ గా సినిమా స్టార్ట్ చేసిన అఖిల్

Monday,March 26,2018 - 07:17 by Z_CLU

ఎలాంటి బజ్ లేదు. చిన్న లీక్ కూడా లేదు. అసలు ఈ రోజు ఓపెనింగ్ ఉంటుందంటూ ప్రకటన కూడా చేయలేదు. అంతా సైలెంట్ గా జరిగిపోయింది. అఖిల్ మూడో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నాగార్జున క్లాప్ కొట్టగా, దేవుడి పటాలకు దండం పెడుతున్న అఖిల్ పై ఫస్ట్ షాట్ తీశారు. అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖులంతా ఈ లాంఛింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

అయితే అందర్నీ ఎట్రాక్ట్ చేసిన వ్యక్తి మాత్రం దుల్కర్ సల్మాన్. అవును.. మహానటి పని మీద హైదరాబాద్ వచ్చిన దుల్కర్ ను ఈ ఓపెనింగ్ కు స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. అతడే కెమెరా స్విచాన్ చేశాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా మే నెల నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తొలిప్రేమతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరికి ఇది రెండో మూవీ. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.