అఖిల్ కొత్త సినిమా లాంచ్ అయింది

Friday,May 24,2019 - 01:07 by Z_CLU

అఖిల్ కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ రోజే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ కార్యక్రమం జరిగింది. నిన్న మొన్నటి వరకు పోర్చుగల్ లో ‘మన్మధుడు 2’ సినిమాతో బిజీ బిజీగా ఉన్నా నాగార్జున కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు.

‘మిస్టర్ మజ్ను’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తరవాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సెట్స్ పైకి రానున్నాడు అఖిల్. వరసగా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తున్న అఖిల్ కోసం మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడో చూడాలి.

గోపీసుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బన్ని వాస్, వాసు వర్మ సంయుక్తంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.