అఖిల్ Mr. మజ్ను నుండి ఫస్ట్ సింగిల్ ‘ఏమైనదో…’ రిలీజయింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట, ఎక్స్ పెక్ట్ చేసినట్టుగానే యూత్ కి తెగ నచ్చేస్తుంది. సినిమాలో ఏ సిచ్యువేషన్ లో ఉండబోతుందనేది గెస్ చేయడం కష్టమే కానీ, స్లో పేజ్ లో కంపోజ్ అయిన ఈ పాట, ఈ సినిమా జ్యూక్ బాక్స్ పై మరిన్ని అంచనాలు పెంచేస్తుంది.
సాంగ్ లో ఫస్ట్ చరణంలో ‘ఎవరితోనూ చెప్పలేని వింత యాతన… తలను వంచి తప్పుకెళ్ళు తప్పే చేశానా…?’ అనే లిరిక్స్, సినిమా స్టోరీలైన్ పై క్యూరియాసిటీ రేజ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా అఖిల్ క్యారెక్టరైజేషన్ పై ఫ్యాన్స్ లో మరింత ఎగ్జైట్ మెంట్ క్రియేట్ అవుతుంది.
తమన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ కి మరింత గ్రేస్ ని ఆడ్ చేస్తున్నాయి శ్రీమణి రాసిన లిరిక్స్. సాంగ్ తో పాటు ఈ వీడియోలో ఉన్న విజువల్స్ సింప్లీ సూపర్బ్. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. జనవరి 25 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది Mr మజ్ను.