Most Eligible Bachelor సెట్స్ పైకి అఖిల్

Friday,September 18,2020 - 12:43 by Z_CLU

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చింది. హీరోయిన్ పూజా హెగ్డే ముందుగా సెట్స్ పైకి వచ్చింది. ఆమెపై ఒక రోజు షూట్ కూడా చేశారు. ఇప్పుడు అఖిల్ కూడా సెట్స్ పైకి వచ్చాడు. దీంతో మూవీ షూటింగ్ మరింత ఊపందుకుంది.

Akhil-PoojaHegde ఇద్దరూ సెట్స్ పైకి వచ్చిన విషయాన్ని యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఏకథాటిగా ఫైనల్ షెడ్యూల్ పూర్తిచేసి, పోస్ట్ ప్రొడక్షన్ లోకి ఎంటరవుతామని చెబుతోంది.

బొమ్మరిల్లు భాస్కర్ డైరక్ట్ చేస్తున్న ఈ మూవీని GA2 Pictures బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ ప్రజెంటర్.

‘Most Eligible Bachelor’ Movie ను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట.