అజిత్- ప్రభాస్... నో ఫొటోస్

Thursday,February 21,2019 - 05:02 by Z_CLU

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ షూటింగ్ హైదరబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షూటింగ్ లో కాసేపు సందడి చేసాడు తమిళ్ హీరో అజిత్. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘పింక్’ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు అజిత్. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ వచ్చాడు. అయితే పక్కనే ‘సాహో’ షూటింగ్ జరుగుతుండటంతో ఆ సెట్ లో అడుగుపెట్టి ప్రభాస్ ను కలిసి కాసేపు ముచ్చటించాడు అజిత్.

ఉన్నపళంగా అజిత్ తమ సెట్ కి రావడంతో హ్యాపీ గా ఫీలయిన ప్రభాస్ షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి అజిత్ కి కొంత టైం కేటాయించి మాట్లాడాడు. బాహుబలితో తమిళ్ నాడులో కూడా ఓ అరుదైన రికార్డు నెలకొల్పిన ప్రభాస్ ను ఈ సందర్భంగా మెచ్చుకున్నాడట అజిత్. చిట్ చాట్ తర్వాత వీరిద్దరూ కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారట. అయితే వాటిని మంచి సందర్భం చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయలనుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే వీరిద్దరూ కలిసారనే విషయం హాట్ టాపిక్ గా మారినా అభిమానులకు ఫోటోలు మాత్రం దొరకడం లేదు. ఈ ఫొటోస్ బయటికొస్తే ఇద్దరు హీరోల అభిమానులు పోస్టులతో… కామెంట్లతో రచ్చ చేయడానికి రెడీ ఉన్నారు.