బ్లాక్ బస్టర్ డైరెక్టర్ 'బెల్లంకొండ'తో ఫిక్స్ !

Thursday,February 07,2019 - 11:40 by Z_CLU

గతేడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాదించిన సినిమా ‘ఆర్ ఎక్స్ 100’.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయిన అజయ్ భూపతి నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇటివలే ఈ డైరెక్టర్ నెక్స్ట్ లిస్టులో ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు వినిపించగా లేటెస్ట్ గా తన సినిమాకు హీరో ను ఫైనల్ చేసుకున్నాడు అజయ్. బెల్లం కొండ శ్రీనివాస్ తో రెండో సినిమాను చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు ‘మహా సముద్రం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ సమంత ను సంప్రదిస్తున్నారని సమాచారం. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ హౌజ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.