శృతిహాసన్ దారిలో...

Friday,October 21,2016 - 12:49 by Z_CLU

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య… గతంలో ‘3’, ‘వై రాజా వై’ సినిమాలకు డైరెక్షన్ చేసింది. ఈ రెండు సినిమాల తరవాత ‘సినిమా వీరన్’ అనే డాక్యుమెంటరీని తెరకెక్కిస్తున్నట్టు వార్తలొచ్చినా అదింకా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పటివరకు బిహైండ్ స్క్రీన్ కే పరిమితమైన ఐశ్వర్య… ఇప్పుడు ఆన్ స్క్రీన్ పై మెరవనుంది. తండ్రితో కలిసి వెండితెరను షేర్ చేసుకోనుంది.

collage

ప్రస్తుతానికి రోబో 2.0 షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్, ఈ సినిమా తరవాత పా రంజిత్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నాడు. కబాలి తర్వాత రంజిత్ దర్శకత్వంలో చేయబోతున్న ఈ సినిమాలో ఐశ్వర్య కూడా ఓ కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం సౌత్ లో శృతిహాసన్ మాత్రమే తండ్రి కమల్ తో కలిసి నటిస్తుంటే… ఇప్పుడు శృతిహాసన్ బాటలోకి ఐశ్వర్య కూడా చేరిపోయింది.