రేపే గ్రాండ్ గా ‘అజ్ఞాతవాసి’ ఆడియో లాంచ్

Monday,December 18,2017 - 04:54 by Z_CLU

  పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ హంగామా రేపటి నుండి బిగిన్ కానుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ రేపు గ్రాండ్ గా ఆడియో లాంచ్ జరుపుకోనుంది. ఇప్పటికే రిలీజైన 2 సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో లాంచ్ కి సంబంధించి అప్పుడే ప్రిపరేషన్స్ బిగిన్ చేసేసింది సినిమా యూనిట్.

సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్  లో ఉంది.  పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువెల్ నటిస్తున్న ఈ సినిమాలో ఖుష్బూ కీ రోల్ ప్లే చేయడం సినిమా పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

హారిక & హాసిని బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ చేస్తే, రేపు గ్రాండ్ గా జరగనున్న ఆడియో లాంచ్ ఈవెంట్ లో ‘అజ్ఞాతవాసి’ కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేయనుంది సినిమా యూనిట్.