పవన్ తో మహానటి ?

Thursday,February 27,2020 - 01:03 by Z_CLU

ప్రస్తుతం వేణు శ్రీరాం డైరెక్షన్ లో ‘పింక్’ సినిమా రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ మరో వైపు క్రిష్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ను సంప్రదిస్తున్నారు. హిస్టరీ క్యారెక్టర్స్ తో ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట.

అందుకే కొందరు హీరోయిన్స్ ను సంప్రదించిన మేకర్స్ ఫైనల్ గా కీర్తిను అప్రోచ్ అయ్యారని సమాచారం. కీర్తి కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే ‘అజ్ఞాతవాసి’లో పవన్ కళ్యాణ్ సరసన కనిపించింది కీర్తి సురేష్. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కానుంది.