మళ్ళీ ఆ దర్శకుడితో శర్వా ?

Sunday,November 24,2019 - 04:32 by Z_CLU

ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు శర్వానంద్. ’96’ రీమేక్ తో పాటు ‘శ్రీకారం’ అనే సినిమా అలాగే ఓ తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు. ప్రెజెంట్ ఈ మూడు సినిమాలపైనే ఫోకస్ పెట్టిన శర్వా ఆ తర్వాత సుజీత్ తో ఓ సినిమా చేయబోతున్నాడట.

నిజానికి అప్పటి వరకూ సరైన కమర్షియల్ సక్సెస్ లేని శర్వాకి ‘రన్ రాజా రాజా’ తో మంచి బ్రేక్ ఇచ్చాడు సుజీత్. పదేళ్ళకి హీరోగా ఓ కమర్షియల్ సక్సెస్ చూశానని ఆ మధ్య శర్వా స్వయంగా చెప్పుకున్నాడు కూడా. అందుకే తనకి అప్పుడు ఓ సూపర్ హిట్ ఇచ్చిన సుజీత్ తో మళ్ళీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఈ కాంబినేషన్ సినిమాను యూ.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తారని అంటున్నారు. మరి ఈ కాంబో సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడో చూడాలి.