ఎన్టీఆర్ నయా ప్లాన్స్..

Friday,October 28,2016 - 11:46 by Z_CLU

జనతా గ్యారేజ్ తర్వాత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఇవాళ్టి వరకు ఎలాంటి ఎనౌన్స్ మెంట్ చేయలేదు. తన కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయని యంగ్ టైగర్… తెరవెనక మాత్రం బాగానే కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగా చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే వక్కంతం వంశీని రిజెస్ట్ చేసినట్టు ఈమధ్యే తెలిసింది. ప్రస్తుతం తారక్ వద్ద పూరి జగన్నాధ్ ఒక్కడే ఉన్నాడు. అయితే ఇప్పుడు తెరపైకి వినాయక్ కూడా వచ్చి చేరాడు.

adhurs_hw01-909275

అవును.. కుదిరితే వీవీ వినాయక్ డైరక్షన్ లో అదుర్స్ సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట తారక్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. చిరంజీవితో చేస్తున్న ఖైదీనంబర్-150 పూర్తయ్యేంత వరకు వెయిట్ చేసి.. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో అదుర్స్-2 ప్రారంభించాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.