మా సినిమా చూసి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు
Saturday,November 03,2018 - 11:32 by Z_CLU
పంది పిల్ల ప్రధాన పాత్రలో దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’.. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్, నాభ నటేష్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించగా, ప్రశాంతి విహారి స్వరాలు అందించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్లో దర్శకుడు రవిబాబు ఈ మూవీని నిర్మించగా సురేష్ ప్రొడక్షన్ సంస్థలో నిర్మాత సురేష్ బాబు సమర్పించారు.
ఇతర భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ని ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ లో చూపిస్తుండడం విశేషం.. కాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ పనులని దర్శకుడు రవిబాబు వినూత్నంగా ప్లాన్ చేసారు.. సినిమాలో నటించిన పందిపిల్లతో పాదయాత్ర నిర్వహించి అందరి దృష్టి ని సినిమా వైపు మళ్లించుకునేలా చేసాడు.. చిత్ర యూనిట్ తో కేబీఆర్ పార్క్ వద్దనుండి ఫిల్మ్ ఛాంబర్ వరకు పంది పిల్లతో కలిసి పాదయాత్ర చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు..
దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. నాతో పాటు పాదయాత్ర చేసిన వారందరికీ చాల థాంక్స్.. ఇంతకీ ఈ పాదయాత్ర ఎందుకు చేసానంటే ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫంక్షన్ ఉంటుంది.. కానీ మా సినిమా కి అవన్నీ చేయడానికి పెద్ద స్టార్స్ ఎవరు లేరు.. ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు.. ఈ పాదయాత్ర ద్వారా మా సినిమా గురించి అందరికి తెలియజేయాలనుకున్నాం.. ఈ పాదయాత్ర కు మరో ముఖ్య కారణం ఏంటంటే ఈ దీపావళి కి ఎక్కువగా టపాకాయలు పేల్చకండి.. దానివల్ల వన్ మంత్ వరకు క్వాలిటీ ఎయిర్ మనకు అందట్లేదు.. ఇప్పటికే చాల జబ్బులతో బాధపడుతున్న మనకు ఇంకా కొత్తవి రాకుండా ఈ వాతావరణాన్ని కాపాడే బాధ్యత మనది.. ఈ సినిమా ని తప్పక చూడండి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు… అన్నారు..