రీ ఎంట్రీకి రెడీ అవుతున్న స్వాతి

Tuesday,April 21,2020 - 01:49 by Z_CLU

హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వాతి, పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రేక్షకుల ముందుకురావడానికి సిద్దం అవుతుంది ఈ తెలుగు హీరోయిన్. అవును స్వాతి మళ్ళీ ఓ స్పెషల్ క్యారెక్టర్ తో తెలుగులో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది.

చందూ మొండేటి డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘కార్తికేయ’లో స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న ‘కార్తికేయ 2’లో ఓ స్పెషల్ రోల్ చేయబోతుంది స్వాతి. తనకు కలిసొచ్చిన ఈ మూవీతోనే రీఎంట్రీ ఇవ్వాలనేది ఆమె ప్లాన్.

సీక్వెల్ కాబట్టి మూవీలో నిఖిల్ మాజీ ప్రేయసిగా స్వాతి కనిపించనుందట. సినిమాలో స్వాతి క్యారెక్టర్ క్లిక్ అయితే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినట్టే.

ఇటివలే హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసుకున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం నిఖిల్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు.