నటుడు రాజా ఇంటివాడయ్యాడు
Sunday,November 01,2020 - 05:27 by Z_CLU
ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు, నటుడు రాజా పెళ్లి చేసుకున్నాడు. హిమబిందుతో రాజా వివాహం నిన్న గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో జరిగిన ఈ వివాహానికి కొంతమంది సినీప్రముఖులు హాజరయ్యారు.
రాజా పెళ్లికి హాజరైన వాళ్లలో దర్శకులు క్రిష్, త్రివిక్రమ్, వంశీ పైడిపల్లి, కృష్ణవంశీ, అల్లు అరవింద్, సాయిమాధవ్ బుర్రా ఉన్నారు. పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది.
చేసిన తక్కువ సినిమాలతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రాజా. ఫిదా సినిమాలో ఇతడి పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. వీటితో పాటు మిస్టర్ మజ్ను, అంతరిక్షం, చాణక్య సినిమాలతో రాజా మెప్పించాడు. ఏబీసీడీ సినిమాలో విలన్ గా కూడా నటించాడు.