Chiranjeevi Acharya - ప్లాన్ మారిందా?
Monday,April 12,2021 - 01:27 by Z_CLU
కరోన మళ్ళీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లో రిలీజ్ వరకు వచ్చిన సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇప్పటికే నాగచైతన్య-శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన ‘లవ్ స్టోరి’ రిలీజ్ వాయిదా పడింది. కరోన కేసులు ఎక్కువ అవుతున్న కారణంగా ఈ వీకెండ్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఇక ‘లవ్ స్టోరి’ లాగే మరికొన్ని సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. బడా సినిమాలు కూడా రిలీజ్ పోస్ట్ పోన్ కానున్నాయని సమాచారం. రిలీజ్ దగ్గరికి వచ్చిన మెగాస్టార్ ‘ఆచార్య’ కూడా విడుదల వాయిదా పడనుందని ఇన్సైడ్ టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల మే 13న చిరు ‘ఆచార్య’ థియేటర్స్ లోకి రావాల్సి ఉంది. ప్రమోషన్ ప్లానింగ్ కూడా రెడీ అయ్యింది. కానీ తెలుగు రాష్ట్రాలో కోవిడ్ వ్యాప్తి మరీ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం కష్టమని భావించి సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
అఫీషియల్ గా చెప్పలేదు కానీ సినిమా విడుదల వాయిదా పడటం ఖాయమని తెలుస్తోంది. మే లో రావాల్సిన ఈ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. ఇక ‘ఆచార్య’ రూట్ లోనే వెంకటేష్ ‘నారప్ప’ మిగతా సినిమాలు కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ‘ఆచార్య’ కి సంబంధించి మేకర్స్ త్వరలోనే అధికారికంగా రిలీజ్ డేట్ వాయిదాపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆచార్య లో రామ్ చరణ్ సిద్ద అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయాలు, నక్సల్స్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రచారంలో ఉన్నట్లు ఆగస్ట్ కు పోస్ట్ పోన్ అవుతుందా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics