Aadavallu Meeku Johaarlu రిలీజ్ డేట్ మార్చుకుంటున్న శర్వా ?

Wednesday,February 16,2022 - 06:59 by Z_CLU

శర్వానంద్ , రష్మిక జంటగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 25న రిలీజ్ అంటూ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు మేకర్స్ . ఇదే డేట్ కి వరుణ్ తేజ్ ‘గని’ కూడా ఎనౌన్స్ చేశారు. అయితే ‘గని’ కేవలం డేట్ మాత్రమే ప్రకటించారు కానీ ప్రమోషన్ స్టార్ట్ అవ్వలేదు. కానీ ఉన్నట్టుండి ఈ రెండు సినిమాలపై ‘భీమ్లా నాయక్’ రిలీజ్ ఎఫెక్ట్ పడింది.

ఏప్రిల్ 1 కి వస్తుందనుకున్న ‘భీమ్లా నాయక్’ ఉన్నట్టుండి ఫిబ్రవరి 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దీంతో శర్వా , వరుణ్ సినిమాల రిలీజ్ పై కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ‘గని’ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవడం తప్ప మరో దారి లేదు. ఇక శర్వానంద్ సినిమా మాత్రం రిలీజ్ పక్కా అంటున్నారు. కానీ డేట్ మార్చుకొని ఒకరోజు పోస్ట్ పోన్ చేయనున్నట్లు తెలుస్తుంది. అవును ప్రకటించిన డేట్ కి కాకుండా ఫిబ్రవరి 26న శనివారం సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట మేకర్స్.

ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ 26కి ఫిక్సయినట్టే. ఎప్పుడైనా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే చాన్స్ ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ అయితే భారీ ఎత్తున చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమా కాబట్టి భీమ్లా నాయక్ థియేటర్స్ లో ఉన్నప్పటికీ ఈ సినిమాని కూడా ఆడియన్స్ చూస్తారనే నమ్మకంతో ఉన్నారు. కాకపోతే 25న వస్తే పవన్ మేనియాతో ఓపెనింగ్స్ రావని, నెక్స్ట్ డే కి షిఫ్ట్ అయ్యే ప్లానింగ్ లో ఉన్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics