టాలీవుడ్ లో ప్రస్తుతం సరికొత్త కథలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటి వరకూ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసి కాస్త బోర్ గా ఫీలవుతున్న తెలుగు ప్రేక్షకులను డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీస్ తో అలరించబోతున్నారు కొందరు హీరోలు.
లేటెస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి గ్రాండ్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ చేయబోయే సినిమాకు ఎన్నో జాగ్రత్తలు వహిస్తూ ఓ డిఫరెంట్ స్టోరీతో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఇప్పటికే స్వతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ కథను సెలెక్ట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేసిన చిరు ఈ కథతో సిల్వర్ స్క్రీన్ పై సరికొత్తగా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించనున్నాడు.
ప్రెజెంట్ టాలీవుడ్ లో మోస్ట్ వెరైటీ స్టోరీ అంటే అది రామ్ చరణ్-సుకుమార్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఫస్ట్ లుక్ తోనే వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమా ఎంత వెరైటీ గా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు సుక్కు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న క్యారెక్టర్ తో డిఫరెంట్ స్టోరీతో టాలీవుడ్ ఆడియన్స్ ను సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తాడని సమాచారం.
దాదాపు రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్న రవితేజ కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో కూడిన డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావి పూడి డైరెక్షన్ ‘రాజా ది గ్రేట్’ సినిమాలో అంధుడి క్యారెక్టర్ లో డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడు మాస్ మహారాజ్.
ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘అంధగాడు’లో అంధుడిగా నటించిన రాజ్ తరుణ్.. త్వరలోనే ‘రాజుగాడు'(యమ డేంజర్) తో రాబోతున్నాడు. ఈ సినిమాలో క్లిఫ్టో మేనియా(తెలియకుండా దొంగతనం చేయడం) తో భాధపడే యువకుడిగా నటించనున్నాడు రాజ్ తరుణ్.
టాలీవుడ్ ఆడియన్స్ ను కొత్త స్టోరీ తో ఎంటర్టైన్ చేయబోతున్న మరో సినిమా ‘నెపోలియన్’. ప్రతినిధి సినిమా రచయిత ఆనంద్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నీడ ను పోగొట్టుకున్న ఓ వ్యక్తి కథ తో ఎంటర్టైన్ చేయబోతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ చూసి కొత్తగా ఫీలవుతున్నారు ఆడియన్స్.
ఇక నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘శమంతకమణి’ కూడా ఇదే కోవలోకొస్తుంది. ‘శమంతకమణి’ అనే కారు చుట్టూ తిరిగే కథతో కామికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియన్స్ ను కొత్తగా ఎంటర్టైన్ చేస్తుందంటున్నారు యూనిట్.