'మైత్రి' లో అరడజను సినిమాలు 

Sunday,March 10,2019 - 11:02 by Z_CLU

‘శ్రీమంతుడు’ సినిమాతో మొదలైంది ‘మైత్రి మూవీ మేకర్స్’ .. ఆ సినిమా తర్వాత వరుసగా మరో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను ఆడియన్స్ కి అందించి ఓ బ్రాండ్ ప్రొడక్షన్ హౌజ్ గా నిలిచింది. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం మైత్రికి ఎదురు దెబ్బ తగిలింది.

ఈ బ్యానర్ నుండి వరుసగా వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. అయితే  మైత్రి నిర్మాతలు ఇకపై  కాస్త ఆచి తూచి వ్యవహరిస్తారని, ఒకే సారి రెండు మూడు సినిమాలు కాకుండా ఒక దాని తర్వాత మరొకటి నిర్మిస్తారని అనుకున్నారంతా..

అయితే మైత్రి నిర్మాతలు మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా స్పీడు పెంచారు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో ఆరు సినిమాలు రెడీ అవుతున్నాయి. ‘చిత్రలహరి’, ,డియర్ కామ్రేడ్’ గ్యాంగ్ లీడర్’ వైష్ణవ్ తేజ్ సినిమా, కీరవాణి తనయుడి సినిమా ఇలా వరుసగా సినిమాలున్నాయి. ఈ లిస్టు లోకి లేటెస్ట్ గా అల్లు అర్జున్ సుకుమార్ సినిమా కూడా చేరి అరడజను సినిమాల లిస్టుకి చేర్చింది.

ఈ అరడజను సినిమాలు అనౌన్స్ అయి సెట్స్ పై ఉన్నవి మాత్రమే.. ఇవి కాకుండా మరో రెండు, మూడు ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయని సమాచారం. ఈ లెక్కన చూస్తే  మైత్రి నుండి ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం ఖాయమనిపిస్తుంది.