మెగా బ్లాక్ బస్టర్: 4 రోజుల్లో రూ.400 కోట్లు

Monday,December 03,2018 - 01:25 by Z_CLU

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 సినిమా.. కలెక్షన్లలో విశ్వరూపం చూపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబోలో తెరెకక్కిన ఈ గ్రాఫిక్ వండర్, ఫస్ట్ వీకెండ్ కే ఏకంగా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసింది.

ఒక్క ఇండియాలోనే ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలుపుకొని 4 రోజులకు 210 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. తమిళనాడు, కేరళ, యూఏఈ వసూళ్లు కూడా కలిపి విడుదలైన ఈ 4 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది 2.0 సినిమా.

చెన్నైలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కే 10 కోట్ల మార్క్ క్రాస్ చేసి రజనీకాంత్ సత్తాను చాటిచెప్పింది. అటు కేరళలో కూడా విడుదలైన 4 రోజులకే 6 కోట్ల రూపాయల కలెక్షన్ తో దూసుకుపోతోంది 2.0.