Mahesh Babu - డబుల్ ధమాకా!
Monday,May 03,2021 - 09:01 by Z_CLU
స్టార్ హీరోల నుండి ఏడాదికి రెండు సినిమాలు వస్తే ఇక అభిమానులకి పండగే. అందుకే ఫ్యాన్స్ కోసం ఈ మధ్య స్టార్ హీరోలు వారి ప్లాన్ మార్చుకొని ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ నుండి ఫ్యాన్స్ కి అలాంటి డబుల్ ధమాకానే అందబోతుంది.
అవును.. వచ్చే ఏడాది సూపర్ స్టార్ నటిస్తున్న రెండు సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. తాజాగా మహేష్ -త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమా వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ అంటూ ప్రకటించేశారు.
#SSMB28 ఎనౌన్స్ మెంట్ రోజే రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. దీంతో తమ అభిమాన హీరో నుండి వచ్చే ఏడాది రెండు సినిమాలు రానున్నాయని సంబరపడిపోతున్నారు అభిమానులు. అన్ని అనుకున్నట్లే జరిగితే ‘సర్కారు వారి పాట’ ఈ ఏడాదిలో విడుదల కావాలి. కానీ కోవిడ్ ఎఫెక్ట్ లాక్ డౌన్ తో ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్ళడంతో రిలీజ్ లో మార్పు వచ్చింది. ఇక లాక్ డౌన్ తర్వాత దుబాయ్ లో మొదటి షెడ్యుల్ జరిపారు. రెండో షెడ్యుల్ కొచ్చే సరికి మళ్ళీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగిలింది. దీంతో ఓ మూడు రోజులు జరిగిన రెండో షెడ్యుల్ మళ్ళీ వాయిదా పడింది.
ఇవన్నీ ఆలోచించే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను దింపాలని ఫిక్స్ అయ్యారు. ఎలాగో ఇంకా ఏడు నెలలు ఉంది కాబట్టి ఈ లోపు మిగతా షెడ్యుల్స్ కూడా పూర్తి చేసి సినిమాను థియేటర్స్ లోకి తీసుకోచ్చేస్తారు. ఇక త్రివిక్రమ్ -మహేష్ సినిమా కూడా అంతే వచ్చే ఏడాది సమ్మర్ కల్లా అంతా పూర్తి చేసి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సో ఈ ఏడాది తన సినిమా లేని లోటుని నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలతో భర్తీ చేయబోతున్నాడు మహేష్. సూపర్ స్టార్ నటిస్తున్న ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి వీటితో మహేష్ ఏ కలెక్షన్స్ రాబడతాడో వేచి చూడాలి.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics