త్వరలోనే 2.0 టీజర్

Sunday,January 28,2018 - 06:03 by Z_CLU

సూపర్ స్టార్ రజినీకాంత్ -శంకర్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న 2.0 ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇటివలే దుబాయ్ లో ఆడియో వేడుక జరుపుకున్న ఈ సినిమా త్వరలో హైదరాబాద్ లో టీజర్ లాంచ్ జరుపుకోనుంది. ఇక ముందుగా ఈ సినిమా టీజర్ నవంబర్ లో రిలీజ్ చేయాలనుకున్న మేకర్స్ సినిమా జనవరి నుంచి ఏప్రిల్ కి వాయిదా పడటంతో టీజర్ లాంచ్ కూడా వాయిదా వేసారు. అయితే ఈ సినిమా టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రజిని అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు శంకర్.

ప్రస్తుతం టీజర్ కి సంబంధించి అమెరికాలో వర్క్ జరుగుతుందని, ఆ వర్క్ పూర్తవ్వగానే టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. హైదరాబాద్ లో భారీ ఎత్తున జరగనున్న ఈ టీజర్ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి , మమ్ముట్టీ ముఖ్య అతిధులుగా హాజరవుతారని సమాచారం.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండగా అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది.