ఈరోజే 2.0 ఆడియో రిలీజ్

Friday,October 27,2017 - 12:04 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2.0 సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ మరికొన్ని గంటల్లో గ్రాండ్ గా ప్రారంభంకానుంది.  ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఓ ఇండియన్ సినిమా ఆడియో వేడుకను బుర్జ్ ఖలీఫాలో నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం.

ఆడియో ఈవెంట్ కు సంబంధించి ఇప్పటికే స్టార్స్ అంతా దుబాయ్ చేరుకున్నారు. ప్రత్యేక అతిథిగా కమల్ హాసన్ కూడా దుబాయ్ చేరుకున్నారు. సూర్య, కార్తి, జ్యోతిక కూడా వేడుకలో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.

మరోవైపు బుర్జ్ ఖలీఫా పార్క్ లో వేడుక కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేశారు. 125 మంది సింఫనీ కళాకారులతో సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ లైవ్ షో.. టోటల్ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణ కానుంది. టాలీవుడ్ స్టార్ రానా ఈ టోటల్ ఈవెంట్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు.

ఆడియో ఫంక్షన్ సందర్భంగా బుర్జ్ ఖలీఫా టవర్ తో పాటు దుబాయ్ లోని మెట్రో స్టేషన్స్, ఎయిర్ పోర్ట్స్ ను 2.0 పోస్టర్లతో గ్రాండ్ గా డెకరేట్ చేశారు. దుబాయ్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ ఫంక్షన్ కోసం 12వేల పాసులు జారీచేశారు మేకర్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దుబాయ్ అంతా ఈరోజు పండగ చేసుకుంటోంది.

ఈ ఒక్క ఈవెంట్ కోసం 12 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తోంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ. ఈ 12 కోట్లలో 2 కోట్ల రూపాయల్ని కేవలం ఎల్ఈడీల కోసమే కేటాయించింది. దుబాయ్ లోని షాపింగ్ మాల్స్, ప్రధాన కూడళ్ల వద్ద ఆడియో లైవ్ కోసం ఈ ఎల్ఈడీలు ఏర్పాటుచేశారు.

2.0 ఆడియో ఫంక్షన్ కు కమల్ హాసన్ తో పాటు దుబాయ్ రాజు మెహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యే అవకాశముంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్, ఎమీ జాక్సన్ లు నేరుగా హెలికాప్టర్ నుంచి వేదికపైకి దిగే ఏర్పాట్లు చేస్తున్నారు.

రెహ్మాన్ లైవ్ కన్సర్ట్ తో పాటు హీరోయిన్ ఎమీ జాక్సన్ కూడా ప్రత్యేక ప్రదర్శన ఇచ్చే అవకాశముంది. వీటితో పాటు మరిన్ని స్పెషల్ ఎట్రాక్షన్స్ కు వేదికగా నిలవనుంది 2.0 ఆడియో ఫంక్షన్.