ఇండియన్ 2

Tuesday,October 03,2017 - 06:35 by Z_CLU

క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్‌ల హిట్  కాంబినేష‌న్‌లో  భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా  తెరకెక్కనున్న`ఇండియ‌న్ 2` సినిమాను భారీ బ‌డ్జెట్ తో  దిల్‌రాజు త‌న నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై నిర్మించ‌నున్నారు.

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బేన‌ర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన సంగ‌తి తెలిసిందే. మా ప్ర‌య‌త్నాన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు వారు మా బేన‌ర్‌పై ఉంచిన న‌మ్మ‌కంతో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `ఇండియ‌న్ 2` సినిమాను నిర్మించ‌బోతున్నాం. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో కాంటెంప‌ర‌రీ పాయింట్‌తో ఈ సీక్వెల్ రూపొంద‌నుంది. మా నిర్మాణ సంస్థ‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారు సినిమాను డైరెక్ట్ చేస్తారు. శంక‌ర్‌గారు ప్ర‌స్తుతం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ `2.0`తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తైన వెంట‌నే, మా `ఇండియ‌న్ 2` మొద‌లవుతుంది. మొద‌టి భాగంగా వ‌చ్చిన `భార‌తీయుడు` సినిమా ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఆ సినిమాను మించేలా `ఇండియ‌న్ 2`ను తెలుగు, త‌మిళ భాషల తో పాటు ఇతర భాషల్లో  నిర్మించ‌బోతున్నాం. సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.