Zee Special – March Month Releases
Tuesday,March 02,2021 - 11:22 by Z_CLU
సాధారణంగా మార్చి నెలలో సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఎగ్జామ్ సీజన్ కావడంతో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలన్నింటినీ ఏప్రిల్-మే నెలలకు పోస్ట్ పోన్ చేస్తుంటారు. కానీ లాక్ డౌన్ వల్ల సినిమాలన్నీ ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఏడాది మార్చ్ మంత్ లో కూడా మంచి సినిమాలే వస్తున్నాయి. వారానికి ఓ బజ్ ఉన్న సినిమా థియేటర్లలోకి వస్తోంది.
మార్చి ఫస్ట్ వీక్ లో సందీప్ కిషన్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ థియేటర్లలోకి వస్తోంది. తెలుగులో వస్తున్న ఫస్ట్ హాకీ బేస్డ్ మూవీ ఇదే. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు బజ్ ఉంది.
దీంతో పాటు వస్తున్న షాదీ ముబారక్ సినిమాపై కూడా మంచి బజ్ నడుస్తోంది. పేరుకు చిన్న సినిమానే అయినప్పటికీ బుల్లితెర స్టార్ సాగర్ నటించిన ఈ సినిమా కచ్చితంగా హిట్టవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఫస్ట్ వీక్ లో ఈ రెండు సినిమాలతో పాటు రాజ్ తరుణ్ నటించిన పవర్ ప్లే అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అటు A-యాడ్ ఇన్ఫినిటమ్, క్లైమాక్స్, గజకేసరి, ప్లే బ్యాక్ లాంటి సినిమాలు కూడా మార్చి మొదటివారంలో థియేటర్లలోకి వస్తున్నాయి.
ఇక మార్చి రెండో వారంలో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 సినిమాలపై మంచి అంచనాలుండడం విశేషం. రాజేంద్రప్రసాద్-శ్రీవిష్ణు తండ్రికొడుకులుగా నటిస్తున్న సినిమా గాలి సంపత్. స్టార్ డైరక్టర్ అనీల్ రావిపూడి ఈ సినిమాకు ప్రజెంటర్ గా వ్యవహరించడమే కాకుండా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు. అందుకే ఈ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.
ఇక నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన జాతిరత్నాలు అనే సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా అందర్నీ ఆకర్షిస్తోంది. అటు శర్వానంద్ చేసిన శ్రీకారం సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి.
మార్చి మూడో వారంలో శశి సినిమా వస్తోంది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఓ పాట పెద్ద హిట్టవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చావుకబురు చల్లగా అనే సినిమా కూడా థర్డ్ వీక్ లోనే థియేటర్లలోకి వస్తోంది. వీటితో పాటు మోసగాళ్లు, ఏదే మా కథ, శశికళ, ఓ మంచి రోజు చూసి చెప్తా లాంటి సినిమాలు కూడా అదే రోజున
థియేటర్లలోకి వస్తున్నాయి.
ఇక మార్చి నెలకు ఫినిషింగ్ టచ్ ఇస్తూ వస్తోంది రంగ్ దే మూవీ. నితిన్-కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ అవుతోంది. వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
అదే రోజున రంగ్ దేకు పోటీగా రానా నటించిన పాన్ ఇండియా మూవీ అరణ్య కూడా థియేటర్లలోకి వస్తోంది.
సింహా కోడూరి హీరోగా నటిస్తున్న రెండో సినిమా తెల్లవారితే గురువారం అనే సినిమా కూడా మార్చి ఎండింగ్ లోనే థియేటర్లలోకి వస్తోంది. ఇలా ఈ నెలలో వారానికో ఇంట్రెస్టింగ్ మూవీ థియేటర్లలో అడుగుపెడుతోంది.