Will Siddharth be busy again in Tollywood

Monday,October 11,2021 - 01:36 by Z_CLU

తెలుగులో చాక్లెట్ బాయ్ ఇమేజ్ అందుకొని వరుస విజయాలు అందుకున్న హీరోల్లో సిద్దార్థ్ ఒకడు. 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనోద్దంటానా' సినిమాలతో స్టార్డం అందుకొని వరుసగా సినిమా అవకాశాలు దకించుకున్నాడు సిద్దు. కానీ ఆ తర్వాత అపజయాలు అందుకొని టాలీవుడ్ లో బ్రేక్ తీసుకున్నాడు. తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న సిద్దు ఎట్టకేలకు మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

శర్వాతో కలిసి 'మహా సముద్రం' అనే సినిమా చేశాడు సిద్దార్థ్. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 14న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ లో పాల్గొన్నాడు సిద్దు. సినిమా తనకి మంచి కం బ్యాక్ అవుతుందనే ధీమా వ్యక్తం చేశాడు. ఇక తన పై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని ఇందులో శర్వా కూడా హీరో అని చెప్పాడు. తన పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయా లేదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుందని తెలిపాడు.

నిజానికి సిద్దు తమిళ్ లో చేసిన కొన్ని సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ జరుపుకొని ఇక్కడ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ అవేవి సిద్దు కి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక మహా సముద్రం తర్వాత మళ్ళీ తెలుగులో బిజీ అవ్వాలని అనుకుంటున్నానని ఎక్కడికి వెళ్ళినా తను టాలీవుడ్ హీరో అని చెప్పుకుంటానని అన్నాడు. దాని వాళ్ళ అటు హిందీ ఇటు తమిళ్ వాళ్ళు ఫీలయ్యారని అన్నాడు. మరి సిద్దు 'మహాసముద్రం'తో కెరటంలా దూసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవంతో మరిన్ని మంచి పాత్రలు దక్కించుకుంటాడా? అనేది వేచి చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics