కోలీవుడ్ లో లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టయిన 'కర్ణన్' సినిమాను తెలుగులో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొడుకు కోసం తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి ఉంచారు బెల్లంకొండ సురేష్. అయితే సినిమా రైట్స్ అయితే కొన్నారు కానీ దర్శకుడి విషయంలోనే ఇంకా చర్చ నడుస్తుంది. మొన్నటి వరకు ఈ సినిమా బాధ్యతలు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టబోతున్నారనే టాక్ వినిపించింది. వారం గడిచే లోపే మళ్ళీ వినాయక్ పేరు చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి రీమేక్ చేస్తున్నాడు వి వి వినాయక్. ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఆ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ లోపు కర్ణన్ రీమేక్ ని కూడా వినాయక్ కే అప్పగించాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ భావిస్తున్నారట. ఇక ఛత్రపతి రీమేక్ ను పెన్ మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.
కర్ణన్ మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ సొంత బేనర్ లో తండ్రి నిర్మాణంలో చేయనున్నాడు. ఈ కాంబోలో అల్లుడు అదుర్స్ వచ్చింది. ఆ తర్వాత వినాయక్ కి మరో సినిమాకు గాను బెల్లంకొండ సురేష్ అడ్వాన్స్ ఇచ్చాడట. ఆ ఒప్పందం మేరకే ఇప్పుడు తన బేనర్ లో వినాయక్ ని కర్ణన్ రీమేక్ చేయాల్సిందిగా కోరుతున్నారట సురేష్. మరి వినాయక్ శ్రీనివాస్ తో బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాలు చేస్తాడా ? లేదా కర్ణన్ ని మరో దర్శకుడి చేతిలో పెట్టాలని సురేష్ కి సూచిస్తాడా చూడాలి.
- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics