పూరి జగన్నాథ్ డ్రీం ప్రాజెక్ట్ ఎట్టకేలకు మొదలైంది. ఎన్నో ఏళ్ల నుండి ఈ కథతో 'జనగణమన' సినిమా చేయాలనుకుంటున్న పూరి ఫైనల్ గా విజయ్ దేవరకొండ తో ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈరోజు రెండు గంటల 20 నిమిషాలకు సినిమా లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేసి గ్రాండ్ గా లాంచ్ చేశాడు పూరి.
ముంబై లో ఎవరూ ఊహించని విధంగా తన డ్రీం ప్రాజెక్ట్ కి ముహూర్తం షాట్ తీశాడు. విజయ్ దేవరకొండను ఈ సినిమాతో ఆర్మీ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. ఆర్మీ గెటప్ లో కొందరు జూనియర్ ఆర్టిస్టులను హెలిపాడ్ మీద కూర్చుబెట్టి, విజయ్ దేవరకొండ హెలికాప్టర్ నుండి ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో దిగి జనగణమన అంటూ అక్కడ నుండి మరో జీప్ ఎక్కుతూ వెళ్ళే సన్నివేశాన్ని గ్రాండియర్ గా షూట్ చేశారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు తన డ్రీం ప్రాజెక్ట్ 'జనగణమన' ని కూడా విజయ్ తోనే పాన్ ఇండియా సినిమాగా తీర్చదిద్దనున్నాడు.
ఇక లాంచ్ సందర్భంగా ఆర్మీ యుద్ధం విజువల్స్ తో భారతమాత చిత్ర పటాన్ని చూపిస్తూ 'జనగణమన' టైటిల్ ని షార్ట్ ఫాంలో JGM చేసి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. శ్రీఖర స్టూడియోస్ బేనర్ పై వంశీ పడిపల్లి , పూరి కనెక్ట్స్ పై ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 3న రిలీజ్ అవ్వనుంది.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics