Venkatesh to remake ‘drishyam2’ in Telugu !

Friday,February 19,2021 - 12:29 by Z_CLU

విక్టరీ వెంకటేష్ ఇప్పటికే చాలా రీమేక్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ధనుష్ 'అసురన్' సినిమాని తెలుగులో 'నారప్ప' గా రీమేక్ చేస్తున్నాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు వెంకీ మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.

మలయాళం సినిమా 'దృశ్యం' ని తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ ఇప్పుడు 'దృశ్యం 2' రీమేక్ లో కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  తెరకెక్కనున్న ఈ రీమేక్ సినిమాను ఒరిజినల్ డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తాడని సమాచారం. త్వరలోనే ఈ రీమేక్ సినిమా డీటెయిల్స్ తో మేకర్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

నిన్న OTT ద్వారా రిలీజైన 'దృశ్యం 2' సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి ఆదరణ అందుకుంటుంది. మరి ఈ రీమేక్ తో వెంకీ మరో హిట్ అందుకోవడం ఖాయం అనిపిస్తుంది.