Uppena Movie follows Rangasthalam

Monday,December 28,2020 - 01:44 by Z_CLU

లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఉప్పెన ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతుంది. మొన్నటి వరకూ ఈ లవ్ స్టోరీను జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. అయితే సంక్రాంతి రవితేజ క్రాక్ , రామ్ రెడ్ లతో పాటు విజయ్ మాస్టర్, అల్లుడు అదుర్స్ ఇలా వరుసగా బడా సినిమాలు ఉండటంతో రిలీజ్ ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.

అవును.. ఇప్పుడు ఉప్పెన ను రంగస్థలం రిలీజ్ అయిన మార్చ్ 30 తేదిన విడుదల చేయాలని భావిస్తున్నారని సమాచారం. అంటే వచ్చే ఏడాది సమ్మర్ కి ఉప్పెన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి రంగస్థలం సెంటిమెంట్ తో ఈ సినిమా కూడా మైత్రి నిర్మాతలకు అలాగే సుకుమార్ కి మంచి లాభాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి లు హీరో హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకుడు.