Trivikram writes story for Venkatesh

Wednesday,May 12,2021 - 01:52 by Z_CLU

కొన్ని కాంబినేషన్ సినిమాలు అభిమానులను ఎప్పుడూ ఊరిస్తూ ఎదురుచూసేలా చేస్తాయి. అలాంటి కాంబోనే వెంకటేష్ -త్రివిక్రమ్ లది. అవును ఈ కాంబోలో సినిమా కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైటర్ గా పనిచేసే రోజుల్లో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్','మల్లీశ్వరి' సినిమాలకు రచన సహకారం చేశాడు త్రివిక్రమ్. ఆ సినిమాల్లో మాటలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు ప్రేక్షకులు. నిజానికి ఆ సినిమాలకు త్రివిక్రమ్ కలం మరింత బలం చేకూర్చింది.

రైటర్ గా వెంకటేష్ తో పనిచేసిన త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక మాత్రం సినిమా చేయలేదు. ఎప్పటి నుండో ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని చూస్తున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన 'అజ్ఞాతవాసి' సినిమాలో వెంకటేష్ చేత ఓ గెస్ట్ రోల్ చేయించాడు త్రివిక్రమ్. అలా త్రివిక్రమ్ డైరెక్షన్ లో కాసేపు నటించాడు వెంకీ. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ ఈ కాంబోలో సినిమా త్వరలోనే రానుందని తెలుస్తుంది.

అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్ నెక్స్ట్ మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్.

ఇటివలే వెంకీ ని కలిసి త్రివిక్రమ్ ఓ స్టోరీ వినిపించి వెంకటేష్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ కాంబో సినిమా గురించి ఓ అప్ డేట్ రానుంది. మరి ఇన్నేళ్ళ తర్వాత వెంకటేష్ ను డైరెక్ట్ చేయబోతున్న త్రివిక్రమ్ విక్టరీని ఎలా చూపిస్తాడో చూడాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics