Sushanth resumes Ichata Vahanamulu Niluparadu Movie Shoot

Thursday,October 08,2020 - 08:05 by Z_CLU

యంగ్ హీరో సుశాంత్ 'అల.. వైకుంఠ‌పుర‌ములో' చిత్రంలో చేసిన పాత్ర‌తో ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. దాని త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు'.

ద‌ర్శ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫిల్మ్‌ను ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్ల‌పై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. 'నో పార్కింగ్' అనేది ట్యాగ్ లైన్‌.

ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో మళ్లీ స్టార్ట్ అయింది. ప్ర‌స్తుతం హీరో హీరోయిన్లు Sushanth, Meenakshi Chowdhary ల‌పై ఓ పాట‌ను పిక్చరైజ్ చేస్తున్నారు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీ‌నివాస‌మౌళి ర‌చించారు.

సెప్టెంబ‌ర్ 20 న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చిత్ర బృందం తెలిపింది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. గేర్ మార్చి బండి తియ్ అనే క్యాప్ష‌న్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది. అంత‌కుముందు విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది.