కింగ్ సైజ్ అంటూ 'రాజా రాజ చోర' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శ్రీ విష్ణు. తొలి రోజే సినిమాకు మంచి మౌత్ టాక్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో సినిమా ఆడియన్స్ తో పాటు సినీ ప్రముఖులను కూడా ఎట్రాక్ట్ చేసింది. సినిమాకు ఇండస్ట్రీని నుండి మంచి కాంప్లిమెంట్స్ దక్కాయి. ఇప్పటికే హరీష్ శంకర్ , కొరటాల శివ లాంటి దర్శకుల నుండి యూనిట్ అభినందనలు , శుభాకాంక్షలు అందాయి.
తాజాగా సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ గారి నుండి కూడా సినిమా టీంకి ప్రశంసలు దక్కాయి. "అభినందనలు , కలెక్షన్లు రెండూ చాలా రేర్ గా వస్తుంటాయి. ఈ సినిమాకు ఆ రెండు రావడం చాలా మంచి విషయం" అంటూ వీడియో ద్వారా సందేశమిచ్చారు సింగీతం. ప్రస్తుతం ఇండస్ట్రీ నుండి మేకర్స్ కి అలాగే శ్రీ విష్ణు , దర్శకుడు హసిత్ లకు మంచి కాంప్లిమెంట్స్ దక్కాయి.
[video width="640" height="640" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2021/08/singeetham.mp4"][/video]
ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తూ థియేటర్స్ సక్సెస్ టూర్ లో ఉన్నారు. కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో పర్యటించారు. 'చోర పర్యటన' అంటూ మొదలైన ఈ టూర్ ఇంకా కొనసాగనుంది. టీం త్వరలోనే మిగతా థియేటర్స్ కూడా పర్యటించి పేక్షకులతో ఇంట్రాక్ట్ అవ్వనున్నారు. ప్రస్తుతం అటు ప్రేక్షకుల నుండి ఇటు ఇండస్ట్రీ నుండి మంచి కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారు రాజ రాజ చోర టీం. త్వరలోనే గ్రాండ్ గా సక్సెస్ మీట్ మరోసారి ఆడియన్స్ అందరికీ థాంక్స్ చెప్పే ఆలోచనలో ఉన్నారు.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics