SS Rajamouli presenting ‘Brahmastra’ film in South !

Saturday,December 18,2021 - 03:55 by Z_CLU

రణబీర్ కపూర్ , అలియా భట్ జంటగా, నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో థియేటర్స్ లోకి రానుంది. కానీ ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్ సినిమాను ఏడాది ముందు నుండే మేకర్స్ భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించి తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ముంబై లో ఈవెంట్ ఏర్పాటు చేసి అక్కడి రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ లో కూడా ఈవెంట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు.

ఇదే ఈవెంట్ లో సౌత్ కి సంబంధించి దర్శకుడు రాజమౌళి సమర్పణలో సినిమా రిలీజ్ అవ్వనుందని ప్రకటించారు. 'బాహుబలి' ఫ్రాంచైజీ తో పాన్ వరల్డ్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ అందుకున్న రాజమౌళి తమ సినిమాను ప్రెజెంట్స్ చేస్తుండటం ఎంతో గర్వించదగిన విషయమని నిర్మాత కరణ్ జోహార్ అన్నారు.  ఇక రాజమౌళి మాట్లాడుతూ దర్శకుడు అయాన్ కి కూడా తనలానే సినిమా మీద అమితమైన ప్యాషన్ ఉందని సినిమాను ప్రాణం పెట్టి తెరకెక్కించాడని చెప్పుకున్నాడు. అలాగే ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని, మొదటి పార్ట్ లో నేనేం చెప్పాల్సిన అవసరం రాలేదని , రెండో భాగానికి సంబంధించి మాత్రం కొన్ని సజిషన్స్ ఇచ్చానని తెలిపాడు. ఈ సినిమాను సౌత్ లో ప్రెజెంట్స్ చేయడం సంతోషంగా ఉందని అన్నాడు.

ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న కింగ్ నాగార్జున సినిమాలో తన క్యారెక్టర్ చిన్నదే అయినా మంచి ఇంపాక్ట్ ఉంటుందని అన్నాడు. అయాన్ చాలా గొప్ప సినిమా తీశాడని దర్శకుడికి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

రణబీర్ కపూర్ , అలియా భట్ , కరణ్ జోహార్ , దర్శకుడు అయాన్ ఈ ఈవెంట్ లో పాల్గొని మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. షూటింగ్ ఫినిషింగ్ స్టేజికి చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న గ్రాంగ్ గా రిలీజ్ అవ్వనుంది.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics