ఇటివలే 'రాజ రాజ చోర' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో శ్రీ విష్ణు మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. 'అర్జున ఫల్గుణ' అనే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. తేజ మర్ని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది.
"నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని." అంటూ శ్రీ విష్ణు చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన టీజర్ లో జగదీశ్ చీకటి విజువల్స్ , ప్రియదర్శన్ బాలసుసుబ్రమణియన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ఇక వాళ్ళు కచ్చితంగా ఇక్కడోళ్ళు కాదు.. బయటోళ్ళు అంటూ సుబ్బరాజు డైలాగ్, ఆ వెంటనే ఒడిసా మైలు రాయి చూపిస్తూ లారీలో హీరోతో మిగతా నలుగురు వెళ్తుండటం ఆసక్తి కలిగించేలా ఉంది. కథ ఇది అంటూ అక్కడక్కడా కొన్ని విజువల్స్ తో టీజర్ లో హింట్ ఇచ్చాడు దర్శకుడు. అలాగే సినిమాలో మంచి యాక్షన్ ఉందని చెప్పేలా టీజర్ లో కొన్ని యాక్షన్ క్లిప్స్ కూడా ఇంక్లూడ్ చేశారు.
ఓవరాల్ గా ఎట్రాక్ట్ చేసే విజువల్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , స్టార్టింగ్ లో శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ టీజర్ లో హైలైట్స్ గా నిలిచాయి. ఫైనల్ గా సినిమాపై ఆసక్తి కలిగించి, బజ్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ వదిలిన ఈ టీజర్ మూవీ లవర్స్ ని ఆకట్టుకొని సినిమా చూడాలి ఆసక్తి కలిగించేలా ఉంది. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది. శ్రీ విష్ణు సరసన అమ్రిత ఐయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వి.కే.నరేష్ , శివాజీ రాజా, సుబ్బరాజు , దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics