Special Song from Veera Simha Reddy Out Now

Sunday,December 25,2022 - 07:30 by Z_CLU

నందమూరి బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి' (VeeraSimha Reddy) జనవరి 12, 2023న సంక్రాంతికి విడుదలవుతుంది.

Special Song from Veera Simha Reddy Out Now

ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్ లో ఉన్న తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి.

Balakrishna Veerasimha reddy

ఇప్పుడు 'ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ 'మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి' పాటతో వచ్చారు మేకర్స్. ఇలాంటి పాటలను మంచి అనుభవం కోసం పెద్ద స్క్రీన్ పై చూడాలి. అందుకే పాటను సంధ్య 35 MM లో గ్రాండ్ గా లాంచ్ చేసారు మేకర్స్. భారీగా హాజరైన అభిమానుల తోనే పాటని గ్రాండ్ గా విడుదల చేయించింది చిత్ర యూనిట్.

Balakrishna Veerasimha reddy

థమన్ (Thaman) తన ట్రేడ్ మార్క్ బీట్ లతో పాటని లైవ్లీ గా స్కోర్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంపోజిషన్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. పాటను విజువల్ గా చూసినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Balakrishna Shruti haasan Veerasimha reddy

సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ లు అద్భుతంగా అలపించారు. ఇక బాలకృష్ణ, చంద్రిక రవి తమ సూపర్ ఎనర్జిటిక్ స్టెప్పులతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూవ్స్ తో మెస్మరైజ్ చేశారు.

Balakrishna Shruti haasan Veerasimha reddy

వైబ్రెంట్ సెట్స్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో చిత్రీకరించిన పాట కలర్ ఫుల్ గా ఉంది. మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని మాస్ తో పాటు క్లాస్ లను మెప్పించే అంశాలను చేర్చాడు.

https://www.youtube.com/watch?v=nZdynKgHcNI Balakrishna Veerasimha reddy Balakrishna Veerasimha reddy