సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, Zee Studios కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు. క్రైసిస్ లో ఉన్న టైమ్ లో తన సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయడంలో జీ స్టుడియోస్ చాలా సాయం చేసిందన్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సక్సెస్ మీట్ లో మాట్లాడిన సాయితేజ్.. సినిమా సక్సెస్ అయినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.
"మే నెలలో సినిమా రిలీజ్ అనుకున్నప్పటికి 2 పాటలు మిగిలిపోయాయి. అదే సమయంలో కోవిడ్ ప్రభావం స్టార్ట్ కావడంతో అందరూ అయోమయంగా తయారయ్యాం. అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయపడ్డాం. అదే సమయంలో జీ స్టూడియో నుండి ఓ ఆఫర్ వచ్చింది. వాళ్లకి సినిమాను ఇవ్వాలా వద్దా అని అనుకున్నాం. అయితే చివరకు ప్రొడ్యూసర్గారికి లాభాలు కావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం. అయితే థియేటర్స్ ఓపెన్ అయ్యి.. అప్పటికి సినిమా ఓటీటీలో విడుదల కాలేదంటే సినిమాను థియేటర్స్లోనే విడుదల చేద్దామనే అనుకున్నాం. అదే సమయంలో జీ స్టూడియో వాళ్లు కూడా సినిమాను చూసి దీన్ని థియేటర్స్లో విడుదల చేస్తే బావుంటుందని సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం."
సినిమాను రిలీజ్ చేసిన యూవీ వంశీ, దిల్ రాజుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన సాయితేజ్.. తనను, సినిమాను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పాడు.