Sharwanand, Varun Tej coming-up with his films on same day
Tuesday,February 15,2022 - 03:30 by Z_CLU
ఒకే రోజు రెండు మీడియం బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయితే. వచ్చే ఓపెనింగ్ ఇద్దరూ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నెల అదే జరగనుంది. అవును ఫిబ్రవరి 25న రెండు సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. శర్వానంద్ , వరుణ్ తేజ్ తమ సినిమాలతో ఒకే రోజు థియేటర్స్ లోకి వస్తున్నారు.
శర్వా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాతో 25న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ప్రేక్షకులకు సడెన్ సర్ ప్రయిజ్ ఇచ్చాడు వరుణ్ తేజ్. 'గని' సినిమాను 25న రిలీజ్ అంటూ అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.
దీంతో 25న యంగ్ హీరోల మధ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ జరగనుంది. 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' శతమానం భవతి తర్వాత శర్వా నుండి వస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది. ఈ సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రెడ్ తర్వాత కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంది.
ఇక వరుణ్ తేజ్ ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్న 'గని' సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు అల్లు బాబీ -సిద్దు నిర్మాతలు. కొన్ని నెలల నుండే గట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు.
నిజానికి ఈ యంగ్ హీరోల నుండి వస్తున్న ఈ సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్స్. శర్వా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంటే మిగతా ఆడియన్స్ ని తన సినిమాకి రప్పించే ప్లాన్ లో ఉన్నాడు వరుణ్. మరి ఈ ఇద్దరు సూపర్ హిట్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు అందుకుంటారేమో చూడాలి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics