Sai Tej message on theaters reopen attracts all

Friday,December 04,2020 - 01:48 by Z_CLU

తెలంగాణలో ఇవాళ్టి నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. ఆక్యుపెన్సీ కూడా బాగుంది. ఇలాంటి టైమ్ లో హీరో సాయితేజ్ మరో అడుగు ముందుకేశాడు. తనే స్వయంగా ఓ థియేటర్ కు వెళ్లాడు. అందరూ థియేటర్లకు రావాలని, భయపడాల్సిన అవసరం లేదని సందేశం ఇచ్చాడు.

ప్రసాద్ మల్టీప్లెక్సులో అడుగుపెట్టాడు సాయితేజ్. తను ఇంట్లో బయలుదేరినప్పట్నుంచి, పాప్ కార్న్ పట్టుకొని థియేటర్లోకి ఎంటరైన వరకు ప్రతి ఎలిమెంట్ ను వీడియోలో చూపించాడు.

[video width="640" height="352" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2020/12/sai_dharam_tej_theaters_reopen.mp4"][/video]

థియేటర్లు తెరుచుకున్న వేళ.. సాయితేజ్ ఇలా ముందుకొచ్చి మంచి సందేశం ఇవ్వడం ఇటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీని బాగా ఎట్రాక్ట్ చేసింది.

సాయితేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది.