Raashi Khanna to Romance with Gopichand again ?

Tuesday,February 09,2021 - 12:19 by Z_CLU

మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాలో క్యారెక్టర్స్ ని కూడా లాక్ చేసే పనిలో బిజీ అయ్యాడు మారుతి. తాజాగా గోపీచంద్ సరసన హీరోయిన్ గా రాశీ ఖన్నా ని తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో గోపీచంద్ తో కలిసి 'జిల్', 'ఆక్సిజన్' సినిమాల్లో నటించింది రాశీ.

మారుతి ప్రీవియస్ మూవీ 'ప్రతీ రోజు పండగే' లో కూడా రాశి హీరోయిన్ గా నటించింది. సో అటు గోపీచంద్ తో ఇటు మారుతి సినిమాలు చేసిన రాశీ మరోసారి ఈ ఇద్దరితో కలిసి వర్క్ చేయనుందని సమాచారం.

'పక్కా కమర్షియల్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బండ్ల గణేష్ ఓ కామిక్ రోల్ చేయనున్నాడు. గీతా ఆర్ట్స్ 2, యూ.వీ.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది.