అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే థియేటర్స్ రావాల్సిన మోస్ట్ ఎవైటింగ్ సినిమాల్లో ప్రభాస్ 'రాధేశ్యామ్' ఒకటి. మేజర్ పార్ట్ షూట్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి కొన్ని రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రభుత్వం షూటింగ్ కి పర్మీషణ్ ఇవ్వగానే హైదరాబాద్ లోనే బ్యాలెన్స్ షూట్ ని ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.
సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం మేకర్స్ ముందున్న డేట్ అయితే ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి అనుకున్న డేట్ కి రీచ్ అయ్యే ప్లానింగ్ లో ఉన్నారు. త్వరలోనే సాంగ్స్ , ట్రైలర్ రిలీజ్ చేసే సినిమాపై బజ్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే డేట్ ఫైనల్ చేసి ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.
[caption id="attachment_186299" align="alignnone" width="409"]
రాధేశ్యామ్ మూవీ స్టిల్[/caption]
జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇటలీ నేపథ్యంలో పిరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే ఆల్బం నుండి మొదటి పాట విడుదల కానుంది. గోపికృష్ణ మూవీస్ పై కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ , T సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics