Pooja Hegde Joins the sets of Most Eligible Bachelor

Tuesday,September 15,2020 - 05:56 by Z_CLU

హీరోయిన్ పూజా హెగ్డే సెట్స్ పైకి వచ్చేసింది. అఖిల్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor)మూవీ ఫ్రెష్ షెడ్యూల్ మొదలైంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా, దాదాపు 7 నెలల తర్వాత ఇలా మళ్లీ ప్రారంభమైంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో ముంబయిలో లాక్ అయింది Pooja Hegde. దాదాపు 5 నెలలు అక్కడే ఉండిపోయింది. ఇప్పుడీ సినిమా కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. మొన్ననే హైదరాబాద్ వచ్చిన పూజా, ఈరోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెట్స్ పైకి వచ్చింది.

ఈ నెలలోనే ఆమె రాధేశ్యామ్ (Radheshyam) మూవీని కూడా స్టార్ట్ చేయబోతోంది. Prabhas హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా సెట్ వేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారం రోజుల్లో ఆ షెడ్యూల్ కూడా మొదలవుతుంది.