నిన్న జరగాల్సిన 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోని విధంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గౌతం రెడ్డి హఠాన్మరణంతో గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్. మళ్ళీ ఇప్పుడు ఈవెంట్ కి అంతా రెడీ చేస్తున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటలకి 'భీమ్లా నాయక్' ఈవెంట్ ముందుగా ప్లాన్ చేసిన ప్లేస్ లోనే గ్రాండ్ గా జరగనుంది.
ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి కే.టి.ఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరికొందరు రాజకీయ , సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈవెంట్ లో చాలా స్పెషల్ పెర్ఫార్మెన్స్ లు ప్లాన్ చేశారు. పవన్ క్రేజ్ కి తగ్గట్టే ఎంతో గ్రాండ్ గా చేయబోతున్నారు. పవన్ సాంగ్స్ తో వచ్చే మెడ్లీ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా హైలైట్ గా నిలవనుందని తెలుస్తుంది. ఈవెంట్ లో కే.టి.ఆర్ పవన్ గురించి ఏం మాట్లాడతారో ? పవర్ స్టార్ క్రేజ్ గురించి ఏం చెప్తారో ? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అలాగే పవన్ స్పీచ్ మీద కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
నిన్న ట్రైలర్ తో మొదలైన 'భీమ్లా నాయక్' మేనియా రేపు ఈవెంట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్లనుంది. ఈవెంట్ క్లిప్స్ తో రేపటి నుండి సోషల్ మీడియాలో హంగామా మొదలు కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 25న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. మొదటి రోజు పవన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా ? అనే చర్చ నడుస్తోంది.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics